హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా తగ్గుముఖంపడుతున్నది. గడిచిన 24 గంటల్లో 230 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు. తాజాగా 357 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఒకరు వైరస్ ప్రభావంతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,545 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.57 శాతానికి చేరుకుందని చెప్పింది. ఇవాళ 50,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,59,543కు పెరిగింది. ఇందులో 6,50,114 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,884 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ నుంచే అత్యధికంగా 77 కేసులు రికార్డయ్యాయి.