హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 220 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,65,504కు చేరాయి. కొత్తగా 255 మంది డిశ్చార్జి అవగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,57,040కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఒకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,915కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,549 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 44,200 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.