అమరావతి : ఆంధప్రదేశ్లో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు రికార్డయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,82,308కు చేరింది. ఇందులో 19,48,828 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా వైరస్ కారణంగా మరో 18 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 13,531కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,458 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 కేసులు యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ఏపీలో ఇప్పటి వరకు 2,51,93,429 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.