న్యూఢిల్లీ : భారత్తో పాటు ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 650 మార్క్ను దాటాయి. వేగంగా పెరుగుతున్న కేసులు ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగించే విషయం. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు పెరిగింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారంతా కూడా జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న కరోనా ముప్పు మధ్య దాన్ని నివారణ చర్యలపై ఇంకా ప్రజల్లో మనసుల్లో అనేక ప్రశ్నలున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలోని మిల్కెన్ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ లీనా వెన్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించే ‘మూడింట రెండు’ (2 out of 3) ఫార్ములాను సూచించారు.
డాక్టర్ లీనావెన్ మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ ఇబ్బందిని కలిగిస్తుందని, దీన్ని నివారించేందుకు ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు మూడింట రెండు (2 out of 3) ఫార్ములా ప్రభావంతంగా ఉంటుందన్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రజలంతా కనీసం రెండు మూడు రక్షణసూత్రాలు అనుసరించాలన్నారు. ‘వ్యాక్సిన్, మాస్కింగ్, టెస్టింగ్’ కరోనా నిరోధానికి ప్రభావంతంగా పని చేస్తాయన్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడకుండా ఉండేందుకు గతంలోకంటే మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ లీనావెన్ సూచించారు. ‘మూడింట రెండు’ ఫార్ములా ఒమిక్రాన్ను నివారించడంలో చాలా వరకు సహాయకరంగా ఉంటుందన్నారు. మాస్క్ ధరించడం ద్వారా ఒమిక్రాన్ సహా సార్స్-కొవిడ్-2 (SARS-CoV-2) వైరస్ నుంచి ప్రభావవంతమైన రక్షణ ఉంటుందన్నారు. ఆ తర్వాత వైరస్ నుంచి మరో పెద్ద రక్షణ కవచం టీకానేనన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ సోకదు అనేది ఏమీ ఉండదని.. ఇన్ఫెక్షన్ తీవ్రత, ఆసుప్రతిలో చేరడం, మరణాలను తగ్గించడంలో చాలా వరకు కీలకంగా పని చేస్తాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఒమిక్రాన్ ముప్పు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ కొనసాగుతున్నంత కాలం మనల్ని మనం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచుకోవాలని ప్రొఫెసర్ లిన్ వెన్ సూచించారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ తగిన ప్రవర్తన నియమాలపై అందరికీ అవగాహన కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే వీలైనంత వరకు టీకాలు వేయడంతో పాటు పరీక్షలు సైతం పెంచడం ముఖ్యమన్నారు.
టీకాలు వేయని వ్యక్తులు ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉండడంతో పాటు కరోనా వాహకాలుగా మారే ప్రమాదం ఉందని లీనా వెన్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులు ఇతరులకు కూడా సమస్యలు సృష్టించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తప్పనిసరిగా మాస్క్ నిబంధనను తప్పనిసరి చేయాలన్నారు. ప్రస్తుతానికి ప్రజలంతా తప్పనిసరిగా ‘2 అవుట్ ఆఫ్ 3’ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.