మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం తగ్గింది. ఎగువనుంచి వరద నెమ్మదించడంతో 94 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు దాదాపుగా పూర్తిస్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 1,16,533 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు. ప్రస్తుతం 317.900 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో 9.657 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 8.415 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువనుంచి శ్రీశైలానికి 2,22,935 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 879 అడుగుల వద్ద ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182.9910 టీఎంసీల నీరు నిల్వ ఉంది.