హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేనివిధంగా ఆదివాసీ, బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేరొన్నారు. 17న హైదరాబాద్లో ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు కవితను శనివారం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.