అమరావతి : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,628 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,41,724కు పెరిగాయి. తాజాగా 2,744 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 19,5,000 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో 22 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 13,154కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
కరోనాతో చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపూర్లో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 291, చిత్తూరులో 261, నెల్లూరులో 241, కృష్ణాలో 190, ప్రకాశం జిల్లాలో 134 కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.