రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టులపై పోలీసులు పైచేయి సాధించారు. జెంషడ్పూర్లోని దాల్మా కొండల్లో నాటిన 14 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. బొడామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాల్మా కొండల్లో నక్సలేట్లు మందు పాతరలు నాటినట్లు తమకు సమాచారం అందిందని జెంషడ్పూర్ ఎస్పీ తమిల్ వానన్ చెప్పారు. బాంబ్ స్వ్కాడ్ సహాయంతో అక్కడ పరిశీలించగా 14 ల్యాండ్మైన్లను గుర్తించామని, అక్కడే వాటిని నిర్వీర్యం చేశామన్నారు. ఇది తమకు చాలా పెద్ద విజయమని తెలిపారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని, ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ కర్తవ్యమని చెప్పారు.
Jharkhand | We received information that Naxals have planted land mines at Dalma mountain which comes under Bodam police station. We found 14 land mines & were disposed of by Bomb Detection &Disposal Squad. It's a big achievement for police: SSP Jamshedpur M Tamil Vanan (07.08) pic.twitter.com/gZYQLjqwy9
— ANI (@ANI) August 7, 2021