అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1184 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల చిత్తూర్లో ముగ్గురు, నెల్లూరులో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 901989కు చేరింది. ప్రస్తుతం 7338 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 887434 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 7217కు పెరిగింది.