కాశీబుగ్గ, మార్చి 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటాల్కు రూ.10,235 ఉండగా బుధవారం 10,310 పలికింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన శ్రీశైలం 30 బస్తాలు తీసుకురాగా క్వింటాల్కు రూ.10,310 పలికింది. మధ్యరకం రూ.9,800, కనిష్ఠంగా రూ.9 వేలు పలికినట్టు మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.