న్యూఢిల్లీ: అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు సమర్థించింది. అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో సీజేఐ లలిత్తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఎస్ రవీంద్ర భట్, బేలా ఎం త్రివేది, జేబీ పర్దివాలాలు ఉన్నారు.
జస్టిస్ రవీంద్ర భట్ కోటాను వ్యతిరేకించారు. దీనికి సీజేఐ యూయూ లలిత్ కూడా అంగీకారం వ్యక్తంచేశారు. జస్టిస్ లలిత్, భట్లు కోటాను వ్యతిరేకించారు. జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదిలు ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించారు. దీంతో 3-2 తేడాతో పిటిషన్ను కొట్టివేశారు. రాజ్యాంగంలోని 103వ సవరణను సుప్రీం స్వాగతించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అమలుకు సుప్రీం పచ్చజెండా ఊపింది.
అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వడం చట్ట వ్యతరేకం కాదని, రాజ్యాంగం కల్పించిన 50 శాతం సీలింగ్ పరిమితిని కూడా ఉల్లంఘించడం లేదని కోర్టు తెలిపింది. 2019 జనరల్ ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రభుత్వం తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని 103వ సవరణ ద్వారా ఈ కోటాను అమలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంలో పిటీషన్ వేశారు.