హైదరాబాద్ : గడిచిన ఐదు రోజుల్లో 1.30కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ ఆర్టీసీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చిందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా దసరా పండుగ సమయంలో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బయస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందరు ప్రతి ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులో చేసి, సురక్షితంగా గ్యమస్థానాలకు చేరుకోవాలని కోరారు.