గోవిందరావుపేట, డిసెంబర్ 2 : రైతులు ప్రత్యామ్నా య పంట కింద అయిల్పామ్ను సాగు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పం టలపై అధికారులు సైతం రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో భరోసా నింపాలన్నారు. గురువారం కలెక్టర్ మండలంలోని చల్వాయి గ్రామంలో పర్యటించారు. ముందుగా బుస్సాపూర్లో శానిటేషన్ పనులు పరిశీలించారు. గ్రామాల్లో పరిసరాల శుభ్రత మెరుగుపరుచుకోవాలని, హరితహారం అములుకావాలని అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం చల్వాయి గ్రామంలో రైతు వేదిక వద్ద ఉద్యానవన శాఖ ఆధ్వ ర్యంలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతు లు మొగ్గుచూపాలని, ఆయిల్పామ్ సాగు చేయడం వల్ల తకువ పెట్టుబడితో ఎకువ దిగుబడి సాధించవచ్చన్నా రు. వ్యవసాయ శాఖ అందించిన సలహాలు సూచనలు పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శా ఖ పోస్టర్, బుక్లెట్ను కలెక్టర్ ఆవిషరించారు. అనంతరం బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని పరిశీలించి తేమశాతం వచ్చే వరకూ వడ్లు ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. తేమ శాతం 17 ఉండి టోకెన్లు జారీ చేయకపోతే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గన్ని బ్యాగ్ టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్యా డీ క్లీనర్లతో నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించాలన్నారు. జిల్లాలో లక్షా10 వేల 682 ఎకరాలకు గాను 155 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. యాసంగి సీజన్లో ములుగు జిల్లా రైతులు వరికి బదు లు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా చర్య లు చేపట్టాలని మం డల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, సర్పంచ్ ఈసం సమ్మయ్య, మండల కోఆర్డినేటర మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జితేందర్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ అక్బర్, ఎంపీటీసీ ఉమాదేవి, ఏవో కల్యా ణి, ఏఈవో గోపాల్రెడ్డి పాల్గొన్నారు.