సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ): సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి నిల్వ ప్రదేశాల్లో దోమలను నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నారు. దోమల లార్వాలను నియంత్రించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. చెరువుల్లో ఉండే గుర్రపు డెకను తొలగించడంతో సమస్య పరిషారం కాదని గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టారు. లార్వా దశలోనే దోమలను నియంత్రించేందుకు సమర్థవంతంగా దాడి చేయడమే ప్రధానంగా భావించి డ్రోన్లను వినియోగిస్తున్నారు.
చెరువులు, నీటి నిల్వ ప్రదేశాల్లో పిచికారీ
జీహెచ్ఎంసీలోని ఎంటమాలజీ ఫీల్డ్ వరర్ల సహాయంతో చెరువుల్లో భౌతికంగా రసాయనాలను నేషనల్ వెక్టర్ బోర్న్ డీజీసెస్ కంట్రోల్ ఢిల్లీ వారిచే నిర్ణయించబడిన మోతాదులో పిచికారీ చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దీంతో దోమల బెడదను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని లక్ష్యాన్ని చేరేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నది. మురుగు నీరు ఎకువగా నిలిచే చెరువులను మొదటి విడతగా ఎంపిక చేసి, దోమల నివారణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు తెలిపారు. నగరంలో మొదటగా 30 చెరువుల్లో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు వాడే రసాయనాన్ని పిచికారీ చేస్తామన్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒప్పందం చేసుకొని నెలకు రెండుసార్లు, అవసరమైనచోట మూడు సార్లు కూడా పిచికారీ చేస్తున్నామన్నారు.
డ్రోన్ల వల్ల ప్రయోజనాలు..
సమయం ఆదా, ఎకరం చెరువును కేవలం 10 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చు. అన్ని వైపులా పిచికారీ చేసే అవకాశం ఉంది. సమయం, ఖర్చు ఆదా అవుతుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ఒకొక జోన్కు ఒకటి చొప్పున మొత్తం ఆరు డ్రోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 30 చెరువులకు ఒప్పందం చేసుకోగా మరో 20 చెరువుల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదించారు.
దోమల సమస్య ఎకువగా ఉన్న చెరువులు, కుంటలు కాలనీలు, క్వారీలు, ఓపెన్ ప్లాట్లు, డంపింగ్ యార్డు, మూసీనది పరీవాహక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాన్ని పిచికారీ చేసి దోమల లార్వా, పెద్ద దోమలను నియంత్రిస్తున్నారు.