ఊట్కూర్, నవంబర్ 16 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సింగిల్విండో చైర్మన్ మొట్కార్ బాల్రెడ్డి అ న్నారు. మంగళవారం మండలంలోని పులిమామిడిలో సిం గిల్విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి బాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వెన్నుదన్నుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్ర భుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.1, 960 చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుం డా చూస్తామని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఏవో గ ణేశ్రెడ్డి, పీఏసీసీఎస్ సెక్రటరీ హుస్సేన్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకుడు జమీ ర్, విండో డైరెక్టర్లు చెన్నప్ప, రఘుపతిరె డ్డి, అనంతమ్మ, దేవమ్మ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
దామరగిద్ద, నవంబర్ 16 : మండలంలోని కందెన్పల్లి, బాపన్పల్లి, మొగల్మడ్క గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుబంధు సమితి జిల్లా నాయకుడు వెంకట్రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, కందెన్పల్లి సర్పంచ్ గీత, ఉపసర్పంచ్ రా ములు యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.