అమరావతి : అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు బోల్తాపడింది.
తమిళనాడులోని సెలం నుంచి పెనుకొండకు కారులో వస్తుండగా తమిళనాడుకు చెందిన విజయ్కుమార్, చంద్రశేఖర్ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.