వరంగల్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి X రోడ్డు వద్ద రక్తదాన శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం రక్త దానం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి పండ్లు, గుడ్లు, పాలు, ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.