కొత్తపల్లి, మార్చి 10: మాదక ద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీ గురువారం మొదలైంది. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న టోర్నీలో 12 జట్లు పాల్గొంటుండగా, ప్లేయర్లందరికీ భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన మ్యాచ్ల్లో రంగారెడ్డి 7-0తో నిజామాబాద్పై ఘన విజయం సాధించింది. మెదక్ 2-0తో తెలంగాణ పోలీస్పై, ఆదిలాబాద్ 3-0తో నల్లగొండపై గెలిచి టోర్నీలో ముందంజ వేశాయి.