న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు. కీవ్లో చిక్కుకుపోయిన ఓ విద్యార్థిని మాట్లాడిన వీడియోను వరుణ్ గాంధీ సోమవారం ట్విట్టర్లో షేర్ చేశారు. వేరే దేశాలు తమ పౌరులను సురక్షితంగా తీసుకెళ్తుంటే కేంద్రం మాత్రం ఏమీ చేయట్లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని, సరిహద్దుల్లోకి చేరుకునేందుకు భారత రాయబార కార్యాలయం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అధికారుల సాయం లేకుండా వారు ఎలా బయటపడుతారని ప్రశ్నించారు. అక్కడి విద్యార్థులు ఎంతగా వేడుకున్నా అక్కడి రాయబార కార్యాలయ అధికారులు స్పందించట్లేదని పేర్కొన్నారు.