నారాయణపేట నియోజకవర్గంలో ‘గులాబీ’ గుబాలిస్తున్నది. 2009 నుంచి ఇతర పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తుండగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ‘కారు’ ఎక్కిన రాజేందర్రెడ్డికి పట్టం కట్టారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాగా ఏర్పాటు కావడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కనీవిని ఎ రుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రగతి పనులు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన రోడ్ల విస్తరణను పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో పార్కులను అభివృద్ధి చేశారు. ఊహించని రీతిలో జరుగుతున్న పనులను చూసి ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
నారాయణపేట, నవంబర్ 16 : నారాయణపేట నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న ఇతర పార్టీలను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేసింది. తిరిగి ఈసారి ఎన్నికల్లో కూడా కారు జోరు మీద దూసుకుపోతున్నది. 1952 నుంచి మక్తల్ నియోజకవర్గంలో ఉన్న నారాయణపేట, 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కోయిలకొండ, మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలాలతోపాటు నారాయణపేట మున్సిపాల్టీలతో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన నారాయణపేట నియోజకవర్గంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఇతర పార్టీ విజయం సాధించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీ తరఫున ఎస్.రాజేందర్రెడ్డి 40,107 ఓట్లు రాగా, 2,270 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అభివృద్ధిలో భాగస్వాములుకావాలన్న ఉద్దేశంతో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఎస్.రాజేందర్రెడ్డికి 68,767 ఓట్లు, సరాఫ్కృష్ణకు 6,344 ఓట్లు, శివకుమార్రెడ్డికి 53,580 ఓట్లు, రతంగ్పాండురెడ్డికి 20,111 ఓట్లు వచ్చాయి. దీంతో 15,187 ఓట్ల మెజార్టీతో ఎస్.రాజేందర్రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రస్తుతం నారాయణపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో తిరిగి ఎస్.రాజేందర్రెడ్డి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అం దుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నెలన్నర కిందటే గులాబీ బాస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, భీఫారాలను సైతం అందజేయడంతో ప్రచారం ప్రారంభించి ప్రత్యర్థి పార్టీలకంటే పైచేయిగా నిలిచారు. కార్యకర్తలతో, బూత్ స్థాయి కమిటీలతో, వివిధ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి మద్దతు కూడగట్టుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అదేవిధంగా నారాయణపేట జిల్లా ఆవిర్భావం తర్వాత చేపడుతున్న వందల కోట్ల అభివృద్ధి పనులతో రూపురేఖలు మారిపోయాయి. ఊహించనిరీతిలో జరుగుతున్న పనులపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో కనీవినీ ఎరుగని రీతిలో గతంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యే చేయని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ఒకప్పుడు నారాయణపేట అంటే తెలియని స్థితి నుంచి అభివృద్ధి పనుల కారణంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచే స్థాయి చేరుకోవడం గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మెచ్చుకోవడంతోపాటు అందుకు కృషి చేసిన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డిని శభాష్ అని ప్రశంసించడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది. నారాయణపేటలో సత్యనారాయణ చౌరస్తా నుంచి సుభాష్రోడ్, భీమండికాలనీ నుంచి ఎర్రగుట్ట వరకు గల ఇరుకైన రోడ్ల కారణంగా ప్రతినిత్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాజేందర్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మొదటి సారిగా రోడ్ల విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తూ రూ.28కోట్ల 50లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడడమే కాకుండా 80ఫీట్ల రోడ్డు, మధ్యలో డివైడర్లు, పూల చెట్లు, బట్టర్ ఫ్లై లైట్లతో సుందరమైన రోడ్డును నిర్మించారు. రూ.3కోట్ల 65లక్షలతోఅంబేద్కర్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. రూ.9లక్షలతో దోబివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. ఆదర్శ హిల్స్లోని చౌడేశ్వరి ఆలయం సమీపంలో బీసీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. రూ.50లక్షలతో అటవీశాఖ క్వార్టర్స్ నిర్మించారు. మహబూబ్నగర్ అర్బన్ ఎకో పార్క్ మాదిరిగా నారాయణపేట మండలం ఎక్లాస్పూర్లో 200 ఎకరాల్లో రూ.2కోట్ల వ్యయంతో ఎకోపార్క్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. నారాయణపేటలో రూ.2కోట్ల 5లక్షలతో ఈద్గా నిర్మాణ పనులు జరుగుతున్నా యి. రూ.90లక్షలతో వెజ్ – నాన్వెజ్ మార్కెట్ నిర్మించారు. అదేవిధంగా రూ.కోటీ 85లక్షలతో ఫిష్ మార్కెట్ నిర్మించి ఉపయోగంలోకి తీసుకొచ్చారు. రూ.2కోట్లతో జిల్లా గ్రంథాలయ నిర్మాణ పను లు చేపడుతున్నారు.
ఒక్క నారాయణపేట మున్సిపాల్టీలోనే రూ.33కోట్లతో మిషన్ భగీరథ పనులు, రూ.20కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.2కోట్లతో ఎనిమిది మహిళా సంఘా ల భవనాల నిర్మాణాలు జరిగాయి. ఎస్సీ వాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.80లక్షలు మంజూరయ్యాయి. రూ.1కో టి 30లక్షల వ్యయంతో సైన్స్ పార్క్, రూ.85లక్షలతో సీనియర్ సిటిజన్ పార్క్ నిర్మించారు. తాజాగా బీసీ కాలనీ సమీపంలో రూ.2కోట్లతో కేసీఆర్ పార్క్ను నిర్మిస్తున్నారు. వీటితో పాటు సఖి సెంటర్, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించారు. రూ.4కోట్ల వ్యయంతో కొండారెడ్డిపల్లి చెరువును మినీట్యాంక్బండ్కు నిర్మించి అక్కడ ఆహ్లాదకరమైన పార్క్ను పిక్నిక్ స్పాట్గా తీర్చిదిద్దారు. నారాయణపేట జిల్లాకు జిల్లా దవాఖాన మంజూరు చేయించి నారాయణపేట మండలం అప్పంపల్లి సమీపంలో రూ.56కోట్ల వ్యయంతో జిల్లా దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేయించారు. నారాయణపేట మండలం సింగారం సమీపంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి రూ.52కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36కోట్లు, మిషనరీ మెకజ్నైడ్ ల్యాండ్రీ ఏర్పాటుకు రూ.2కోట్లు, నారాయణపేట మండలం అప్పంపల్లి నుంచి కోయిల్కొండ వరకు రూ.56కోట్లతో డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణపేట జిల్లాలోని దాదా పు అన్ని మండలాల్లో వ్యవసాయ గోదాంలు, రైతు భవనాలను నిర్మించారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను నిర్మించారు. ధన్వాడకు డిగ్రీ కళాశాల, నారాయణపేటలో అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల మంజూరుతోపాటు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.