భారతమాత బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువు పీల్చుకుని నేటికి 75 ఏళ్లు. ఎందరో అమర వీరుల త్యాగం, స్వతంత్ర సమరయోధుల పోరాటం ఫలితంగా భారత్ బ్రిటీష్వారి నుంచి విముక్తి పొందింది.. ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధికెక్కింది.. అందుకే పంద్రాగస్టు మనకు ప్రతిష్ఠాత్మకం. అందులోనూ స్వతంత్ర భారత వజ్రోత్సవం అత్యంత ప్రతిష్ఠాత్మకం. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఖమ్మంలోని పోలీస్ పడేర్ మైదానం ముస్తాబైంది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 14 : 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను సోమవారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం గ్రౌండ్ను ముస్తాబు చేశారు. ఈసారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా సకల ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఉదయం 9గంటలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం దళితబంధు, ఇతర రాయితీ యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు.
వివిధశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శకటాల ప్రదర్శన, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో సుమారు 10వేల మంది ప్రజలు పాల్గొనే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షించారు.