భద్రాచలం, ఆగస్టు 14: భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడుతున్నది. శనివారం రాత్రి 10 గంటలకు 50.50 అడుగులు ఉన్న ప్రవాహం ఆదివారం ఉదయం 7 గంటలకు 50.40 అడుగులకు తగ్గింది. 10 గంటలకు 50.60, మధ్యాహ్నం ఒంటి గంటకు 50.70, 3 గంటలకు 50.80 అడుగుల వద్ద నిలకడగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉన్నది. కరకట్ట పైకి పోలీసులు భక్తులను అనుమతించడం లేదు.