అడ్డగూడూరు: జిల్లాలోని బస్వాపుర్ ప్రాజెక్ట్ ద్వారా బునాదిగాని కాలువకు గోదావరి జలాలను మళ్లించి అడ్డగూడూరు, మోత్కూరు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించి రెండు మండలాలను సస్యశ్యా మలం చేయనున్నట్లు తుం గతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళ వారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 22మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బునాదిగాని కాలువ మోత్కూరు మండలం పాటిమట్ల వరకు వచ్చిందని భూ సేకరణ వల్ల ధర్మారం వరకు రావడం అలస్యమైందని త్వరలో పనులు చేయనున్నట్లు తెలిపారు. చిన్నపడిశాల, ధర్మారం గ్రామంలో చెక్డ్యాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 57 సం వత్సరాలలోపు ఉన్న వారికి అసరా పెన్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుంచి బడ్జెట్లో పెట్టనున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ వాసాలమర్రికి వచ్చినప్పుడు గ్రామాలభివృద్ధికి నిధులు కేటాయించమని కోరగా ప్రతి గ్రామపంచాయతీకి రూ.25లక్షలు కేటాయించ డం శుభ పరిణామమని అన్నారు. ఈ నిధులతో గ్రామాలను సర్పంచ్లు అభివృద్ధి చేసుకోవా లన్నారు. కల్యాలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. ఆనం తరం మండల కేంద్రానికి చెందిన అసర్ల మహేందర్ అధ్వర్యంలో నీతి అయో గ్, సీ.ఎస్.ఐ.ఆర్, సెంట్రల్ హెల్త్ మినిష్టరీ పథకం ద్వారా ఇంటింటికీ శానిటైజేషన్ను ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రారంభించారు.
తహసీల్దార్ రామకృష్ణ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి, సింగిల్ విండో చైర్మన్ పోన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కోఆప్షన్ మెంబర్ గుండిగ జోసఫ్, వైస్ ఎంపీపీ దైద పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ బాలెంల త్రివేణి, ఎంపీటీసీ పెండెల భారతమ్మ , టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి,రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ మాదానూ ఆంథోని, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.