గద్వాల న్యూటౌన్, నవంబర్ 16 : జోగుళాం బ గద్వాల జిల్లాలో ఈ సారి మద్యం దుకాణాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో దరఖాస్తులు కూ డా అధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల సడలింపుతో వైన్స్ షాపుల ను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు రాష్ర్టాలకు సరిహద్దు కావడం తో మద్యం వ్యాపారానికి విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఏపీలో మద్యం విక్రయాలపై అక్కడి ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయాలు, పలు బ్రాండ్లు దొరకపొవడంతో మందుబాబులు జిల్లాకు వచ్చి కొనుగోలు చేసి దొడ్డిదారిన తరలిస్తున్నారు. దీం తో అలంపూర్ సెగ్మెంట్లోని మద్యం దుకాణాల వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చాయి. ఇక్క డి దుకాణాలు లాభసాటిగా ఉండడంతో వాటిని దక్కించుకునేందుకు దరఖాస్తుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఓ వ్యాపారి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఏపీకి చెందిన లిక్కర్ వ్యాపారులు మూడు రోజు ల కిందట ఇక్కడి వ్యాపారితో కర్నూల్లో సమావేశమై పోటీలో పాల్గొనేలా సిద్ధమైనట్లు తెలిసింది.
ఈ క్రమంలో అలంపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాలను పొరుగు రాష్ట్రం వ్యాపారు లు, ఇక్కడి వ్యాపారులు బినామీలుగా ఉండి చే జిక్కించుకునేందుకు తెరలేపారు. ఇక్కడి దుకాణాలను దక్కించుకునేందుకు కర్నూల్, నంద్యా ల, కడప, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రాజోళి, అలంపూర్, వడ్డేపల్లి, శాంతినగర్ వైన్స్ దుకాణాలు కూడా ఏపీ సరిహద్దులో ఉండడంతో ఇక్కడా దరఖాస్తులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జిల్లా వ్యాప్తంగా 23 దుకాణాలు ఉండగా.. ఈసారి అదనంగా 13 దుకాణాలు కేటాయించారు. నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం మొత్తం 36 దుకాణాలు ఉన్నాయి.
గతంలో 418 దరఖాస్తులు..
2019-2021 ఏడాదిలో 23 మద్యం దుకాణాలకు టెండర్లు వేయగా 418 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుదారుడు రూ.2 లక్షలు చెల్లించగా ప్రభుత్వానికి రూ.8.63 కోట్ల ఆదా యం సమకూరింది. ఈ ఏడాది 36 దుకాణాలకు దాదాపుగా వెయ్యి వరకు దరఖాస్తులు రావచ్చని అధికారుల అంచనా. దీంతో ప్రభుత్వానికి రూ.20 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. శనివారం 76, సోమవా రం 132, మంగళవారం 96 దరఖాస్తులు వచ్చా యి. దీంతో ఇప్పటి వరకు 304 దరఖాస్తులు వ చ్చాయి. అలంపూర్ సెగ్మెంట్లోని మద్యం దుకాణాలకు 264, గద్వాల సెగ్మెంట్లో 40 దరఖాస్తులు వచ్చాయి. 18వ తేదీన సాయంత్రం 5 గం టలతో గడువు ముగియనుండడంతో దరఖాస్తు లు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
అలంపూర్ పరిధిలో 264 దరఖాస్తులు..
అలంపూర్ ప్రాంతంలోని వైన్స్ దుకాణాలకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. అలంపూర్ ఎక్సైజ్స్టేషన్ పరిధిలో 15 వైన్స్లు ఉండగా.. ఇప్పటి వరకు 264 దరఖాస్తులు వచ్చాయి. గతంలో 8 దుకాణాలు ఉండగా రూ.379 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి ఏడు దుకాణాలు పెరిగాయి. వీటన్నింటికీ కర్నూల్ జిల్లా సరిహద్దుగా ఉన్నది. దీంతో అక్కడి వ్యాపారులు బినామీలుగా దరఖాస్తు చేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక గద్వాల నియోజకవర్గంలోని ఓ కీలక రాజకీయ నేత ఏండ్ల తరబడి లిక్కర్ దందా చేస్తున్నారు. అయితే, ఆ వ్యాపారి బినామీలతో పోటీలో దుకాణాలు దక్కించుకునేందుకు వ్యూహం రచించినట్లు సమాచారం. గతంలో జిల్లాలో ఐదు మద్యం దుకాణాలు దక్కించుకోవడం గమనార్హం.
లాభసాటిగా నయా పాలసీ..
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ లాభసాటిగా ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలను అలాగే ఉంచడం అనుకూలమని అనుకుంటున్నారు. ఇది వరకు నిర్ధారిత వార్షిక ఎక్సైజ్ ట్యాక్స్ను నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా.. ఇకపై ఆరు వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం కల్పించారు. ఒక వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని.. డ్రాలో ఒకటికి మించి ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు అవకాశం ఉండడంతో భలే ఛాన్సులే అని చర్చించుకుంటున్నారు. మద్యంలో సాధారణ లిక్కర్కు 27 శాతం, మీడియం, ప్రీమియం 20 శాతంగా మార్జిన్ ఉంటుంది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో భారీగా దరఖాస్తులు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 20వ తేదీన లక్కీ డిప్ ద్వారా షాపులను కేటాయించనున్నారు.