మోడు వారిన చెట్లు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. ఒకనాటి అపనమ్మకాల మబ్బులను చీల్చుకుని.. మొక్కవోని సంకల్పంతో నిరంతర వసంతకాల గమనంలో సాగుతున్న తెలంగాణకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ దృశ్యం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం పటేల్గూడెం గ్రామంలో కనిపించింది.
-స్వర్గం చంద్రశేఖర్, జనగామ, నమస్తే తెలంగాణ