తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదించింది. అలాగే రైతు రుణమాఫీకి రూ.5,225వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా రాజనగరం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో రైతులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.