Tamilisai Soundararajan | గత కొద్దిరోజులుగా పుదుచ్చేరిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో తమిళిసై సౌందరరాజన్ శనివారం పర్యటించారు. ఆరియాపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వరద బాధితుల శిబిరాన్ని సందర్శించారు. అక్కడి బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తమిళిసై.. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్కేళ్లు పంపిణీ చేశారు. అలాగే.. పుదచ్చేరి-విల్లుపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న శంకరభరణి నది వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు.