Minister KTR | అన్నిసార్లు అన్నింటినీ అక్షరాల్లో చెప్పలేం.. కొన్నిసార్లు మన మనసులోని భావాలను చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఒక్క సైగతో మన ఫీలింగ్ మొత్తాన్ని చెప్పేయొచ్చు. మాటలకందని అనురాగాన్ని, ఆప్యాయతను చూపించవచ్చు. దానికి నిదర్శనమే ఈ ఫొటో. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడుపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇంటి పట్టా అందుకున్న ఓ వృద్ధురాలు.. తన మనసులో ఉన్న సంతోషాన్ని ఇలా తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ను ఆప్యాయంగా దీవించారు.