రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్వయంగా పొంగల్ వండి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజ్భవన్లోని మెయిన్ హౌస్ ముందు గవర్నర్ పొంగల్ వంటకాలు వండి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత గవర్నర్ తమిళిసై, ఆమె భర్త డాక్టర్ సౌందరరాజన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజ్భవన్లోని గోశాలలోని గోవులకు ప్రత్యేక గో పూజలు చేశారు. గో పూజ తర్వాత రాజ్భవన్లోని అమ్మవారి ఆలయంలో గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.