నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రెండు గంటల పాటు పొడిగించింది. ఈ ఎన్నికలో మొత్తం 41 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నోముల భగత్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ బరిలో నిలిచారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి