Power Crisis | పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ్గ స్థాయిలో విద్యుదుత్పత్తి జరగడం లేదు. అనేక రాష్ర్టాల్లో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరెంటు కోతలకు వ్యతిరేకంగా పంజాబ్లోని హోషియార్పూర్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.