భానుడి తాపానికి మనుషులే కాదు.. పశుపక్షాదులు, జంతువులు కూడా ఠారెత్తుతున్నాయి. అందుకే బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల ఉపశమనం కోసం జూ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్క్లోజర్ చుట్టూ నీటి కొలనులను ఏర్పాటు చేశారు. వీటిలో సింహాలు ఆడుతూ ఇలా కనిపించాయి.