Vinayaka chavithi 2021 | గణేశ్ నవరాత్రులకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమవుతున్నాడు. వినాయక చవితి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో గణనాథుడి ప్రతిమ తయారీలో వేగం పెంచారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. 1954లో ఒక్క అడుగుతో మొదలై 62అడుగుల ఎత్తు వరకు స్వామి వారు విరాఠస్వరూపుడై దర్శనమిచ్చారు. అయితే కరోనా కారణంగా ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో గత ఏడాది తొలిసారిగా తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.