రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాన్నిస్తున్నాయి. ఈ కార్యక్రమాల కారణంగా సమైక్య పాలనలో కరవుతో కకావికలమైన పాలమూరులో ఇప్పుడు పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్.. పట్టణవాసులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే లంగ్ స్పేస్గా మారింది. 2087 ఎకరాల్లో తీర్చిదిద్దిన ఈ పార్క్ ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారుతున్నది.