శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజైన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని వినూత్నంగా అలంకరించారు. రూ. 4,44,44,444 ( నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై నాలుగు రూపాయలు)తో అమ్మవారిని అలంకరించారు.