అప్పుడే ఏడాది గడిచిపోయింది ! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి సంవత్సరం అవుతుంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే.. 2021 జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు 156 కోట్ల డోసుల టీకా పంపిణీ మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ , భారత్ బయోటెక్ సంయుక్తంగా ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశాయి.