ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీని మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచే పొగమంచు విపరీతంగా కురిసింది. వాజేడు మండలం ప్రగళ్లపల్లి, జగన్నాథపురం జంక్షన్ తదితర ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడింది. దీంతో జాతీయ రహదారి -163పై వాహనదారులు ఉదయం 8 గంటలకు సైతం లైట్ల వెలుతురులోనే వెళ్లాల్సి వచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న మంచుతో అక్కడి అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. – వాజేడు