కష్టపడి చదివితేనే పాసవుతారు.. అయితే ఆ కష్టానికి కొంత దైవ సంకల్పం తోడుండాలని కొందరు కోరుకుంటారు. ఎవరి నమ్మకం వారిది. ఎవరి భక్తి వారిది. ఇక్కడో బాలిక పది పరీక్షలు రాసేందుకు వెళ్తూ నందీశ్వరుడి చెవిలో తన మనసులోని మాట చెబుతోంది. చింతల్ రోడ్డులోని శివాలయంలో సోమవారం కనిపించిందీ దృశ్యం.