అలసిన భానుడు మబ్బుల్లోకి జారిపోతుండగా, నల్లటి మేఘాలు ఆకాశమంతా పరుచుకొని చీకట్టు కమ్ముకుంది. హుస్సేన్ సాగర్ వద్ద ఈ దృశ్యం సందర్శకులను అబ్బురపర్చింది. కాగా, శుక్రవారం పలుచోట్ల జల్లులు కురవగా, రాగల 2 రోజులు గ్రేటర్ వ్యాప్తంగా మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గరిష్ఠం 38 డిగ్రీలు, కనిష్ఠం 25.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.