ప్రకృతిలో సహజంగా కనిపించే అందాలను మాటల్లో వర్ణించలేం. ఈ దృశ్యం కూడా అదే కోవలోకి వస్తుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ఓ వి చిత్రం కనిపించింది. చుట్టూ ఇసుక.. తెల్లని గవ్వ.. దాని మధ్యలో నుంచి మొలిచిన మొక్క ఎండిపోయి సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఈ దృశ్యాన్ని నమస్తే తెలంగాణ క్లిక్మనిపించింది.
– కోటపల్లి