సినిమా షూటింగ్ సెట్టింగులే చిన్నబోయేలా.. సిద్దిపేటలో ప్రకృతి అందాలు చూపు తిప్పుకోనివ్వడంలేదు. ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట పట్టణ సమీపంలోని తేజోవనం (అర్బన్ పార్క్)లో ఆహ్లాదకరమైన ఫొటోలను తీసిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు.. ‘వైబ్స్ ఆఫ్ సిద్దిపేట’ శీర్షికతో సంతోషాన్ని సూచించే బ్లూలవ్ సింబల్ జోడించి ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఫొటోలు బాగున్నాయి. సిద్దిపేట అన్నింటా ఆదర్శమే’ అంటూ పోస్టులు చేస్తున్నారు. ‘మంత్రి హరీశ్రావు కృషి ఫలితమే ఈ అభివృద్ధి’ అని మరికొందరు అభినందిస్తున్నారు.