చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది. హరితావరణం అలైబలై తీసుకుంటున్నది. పొలాలనన్నీ హలాలదున్ని సేదదీరాలంటే ఇంతకన్నా ఏం కావాలి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో ఓ రైతు పొలం గట్టున ఏర్పాటు చేసిన మూడంచెల మంచె ఇది. అటుగా వెళ్లేవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ మంచె ట్రీహౌస్ను తలపిస్తున్నది.