న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. ఒక్కో క్యాష్ ఆన్ డెలివరీపై రూ.5 అదనపు చార్జీల వసూలు ప్రారంభించింది. జొమాటో బిల్ సమ్మరీలో ఈ చార్జీలు కనిపిస్తున్నాయి. అయితే ఆన్లైన్ పేమెంట్లు చేసే వారికి ఈ ఛార్జీలు వర్తించవని సంస్థ చెబుతున్నది.
లాభాలను పెంచుకోవడం, కస్టమర్లను డిజిటల్ పేమెంట్ల వైపు ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతున్నది. ఇటీవల ప్లాట్ఫామ్ ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచిన సంస్థ ఇప్పుడు మరో ఫీజును విధిస్తున్నది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రం కావడంతో లాభాలను మెరుగుపరుచుకునేందుకే జొమాటో ఇలా చార్జీలను పెంచుతున్నట్టు సమాచారం.