న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలోని యువత అభ్యున్నతికి వేదికగా నిలిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మేరా యువ భారత్ (మై భారత్)ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని తెలిపారు.
ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రి ఠాకూర్ మాట్లాడారు. ‘దేశంలో 15-19 ఏండ్ల మధ్య 40 కోట్ల మంది యువత ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వ వేదికగా నిలవడమే మేరా యువ భారత్ ప్రథమ కర్తవ్యం. సర్థార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నాం’ అని ఆయన తెలిపారు.