పాట్నా: బీహార్(Bihar)కు చెందిన వలస కార్మికుల(Migrant labourers)పై తమిళనాడులో దాడులు జరుగుతున్నట్లు కొన్ని ఫేక్ వీడియోలను(Fake Videos) పోస్టు చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్(Youtuber Kasyap) అనే వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ చంపారన్ జిల్లాలోని బెట్టియా వద్ద ఉన్న జగదీశ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కశ్యప్ను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ పోలీసులకు అతను సరెండర్ అయ్యాడు. అతని ప్రాపర్టీలను అటాచ్ చేసేందుకు ఇవాళ ఆర్థిక నేరాల శాఖ(Economic Offences Unit) కశ్యప్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతను పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.
బీహార్ వలస కార్మికులపై ఫేక్ వీడియోలను సర్క్యూలేట్(Circulate) చేశాడని, తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్న వీడియోలను పోస్టు చేసినందుకు కశ్యప్పై కేసు బుక్ చేశారు. ఇతని కోసం బీహార్, తమిళనాడు పోలీసులు చాన్నాళ్లుగా వేటాడుతున్నారు. వాంటెడ్ జాబితా(Wanted List)లో ఉన్న అతన్ని ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. కశ్యప్కు ఆర్ధిక నేరాల శాఖ మొత్తం మూడు కేసుల్ని బుక్ చేసింది. వలస కార్మికులను కొట్టినట్లు, చంపినట్లు ఫేక్ వీడియోలను అతను క్రియేట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వలస కార్మికుల దాడి ఘటనలపై తమిళనాడు(Tamilnadu)లో మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. ఇక బీహార్లోనూ ఆరు కేసులు బుక్ చేశారు.