న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో బాల్బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో కాంస్య పతకంతో చరిత్ర నెలకొల్పిన పీ వీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాంస్య పతకం సాధించిన పీవీ సింధును ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసించారు. శనివారం జరిగిన సెమీస్లో ఓటమితో ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ కాంస్య పతకం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్లో విజయం సాధించిందని కొనియాడారు.
ఒకవేళ ఒలింపిక్స్లో మనోధైర్యం ఉందంటే.. ఆ విషయంలో ఆమె టాప్లో ఉంటారు. ఒక ఓటమితో నిరుత్సాహ పడకుండా మరింత నిబద్ధతతో, పట్టుదలతో ముందుకు సాగారు. ఆమె ఇప్పటికీ మన గోల్డెన్ గర్ల్@ పీవీ సింధు అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
ఇంకా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హర్ష్ గోయెంకా, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా తదితరులు కూడా పీవీ సింధును ప్రశంసించారు.