న్యూఢిల్లీ, జూలై 7: దేశంలోని వేలాదిమంది కస్టమర్ల ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇటీవల స్తంభింపజేసింది. కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్లే ఖాతాలను నిలిపివేసినట్టు వెల్లడించింది. బ్యాంక్ సేవలు నిరంతరాయంగా కొనసాగించేందుకు.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వినియోగదారులు వారి కేవైసీని క్రమానుగతంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పాస్పోర్ట్, ఓటర్ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డును చిరునామా ధ్రువీకరణకు ఇవ్వొచ్చని పేర్కొంది.
కేవైసీ అప్డేషన్కు సంబంధించి నిర్దిష్ట ఫార్మాట్తో కూడిన ఫారంపై సంతకం చేసిన కస్టమర్ ఆ పత్రాన్ని బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. లేదా ఈ-మెయిల్, పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు. కేవైసీ అప్డేషన్ ఫారం ఆన్లైన్తో పాటు బ్యాంక్ బ్రాంచీలో కూడా అందుబాటులో ఉంటుంది.