హైదరాబాద్ : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమని తిరస్కరించిందని ఓ యువకుడు సదరు యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కోయంబత్తూరులోని తొండముత్తూరులో చోటు చేసుకుంది. బైక్పై స్నేహితుడితో కలిసి వచ్చిన దుండగుడు ఇంటిపై రెండు పెట్రోల్ బాంబ్స్ విసిరి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చి మంటలను ఆర్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్..!
తన ప్రేమని తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఘటన
బైక్పై స్నేహితుడితో వచ్చి.. ఇంటిపై రెండు పెట్రోల్ బాంబ్స్ విసిరిన యువకుడు
మంటలు ఆర్పిన స్థానికులు pic.twitter.com/p2hijnn6XQ
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026