లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కొత్త పేరు పెట్టారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించిన యోగికి ‘బుల్డోజర్ బాబా’గా అఖిలేష్ యాదవ్ పేరు పెట్టారు. ఆదివారం అయోధ్యలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఐదేండ్ల బీజేపీ పాలనలో పేర్లు మార్చడం తప్ప సీఎం యోగి చేసిందేమీ లేదని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అందుకే ఆయనకు ‘బుల్డోజర్ బాబా’గా పేరు పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
కాగా, బీజేపీ నేతలు ఇప్పుడు ఏబీసీడీలు నేర్చుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే, సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా ప్రజలు వెనక్కి తీసుకెళ్తారని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఆ పార్టీని తొలగించడం ఖాయమన్నారు. ప్రజలు తమపై ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ కూడా గ్రహించిందని, అందుకే వారి భాష, ప్రవర్తన మారిపోయిందని దుయ్యబట్టారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఆదివారం మూడో దశ పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో కర్హల్ నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్, ఆయన భార్య జస్వంత్నగర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కూడా అదే పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Etawah | Samajwadi Party (SP) founder-patron Mulayam Singh Yadav arrives at a polling booth in Jaswantnagar, Saifai to cast his vote for the third phase of #UttarPradeshElections2022 pic.twitter.com/k59H8zsnEC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022