లక్నో: పక్షి ఢీ కొనడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసికి శనివారం వచ్చారు. కాశి విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం వారణాసి నుంచి లక్నోకు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమయ్యారు. వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ కాగానే విండోను ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ను కోరారు. ఈ నేపథ్యంలో వారణాసి పోలీస్ లైన్స్ గ్రౌండ్లో సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్రాజ్ శర్మ తెలిపారు.
కాగా, ఈ సంఘటన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్క్యూట్ హౌస్కు తిరిగి వెళ్లారు. కొంత సేపటి తర్వాత ప్రభుత్వ విమానంలో వారణాసి నుంచి లక్నోకు బయలుదేరారు.